తిరుపతిలోని ఓ ఇంట్లో నిషేధిత గుట్కాలు స్వాధీనం
ABN , First Publish Date - 2022-04-16T18:31:57+05:30 IST
నగరంలోని అశోకనగర్లో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 154 బస్తాల నిషేధిత గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి: నగరంలోని అశోకనగర్లో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 154 బస్తాల నిషేధిత గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.28 లక్షల గుట్కాలు సీజ్ చేశారు. మార్కెట్లో వీటి ధర కోటి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుట్కాలతో పాటు నాగేంద్రకుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్ఈబీ సూపరింటెండెంట్ స్వాతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.