తిరుపతిలో వైసీపీ దుర్మార్గం

ABN , First Publish Date - 2021-02-28T15:04:17+05:30 IST

తిరుపతిలో వైసీపీ నేతలు దుర్గార్గంగా వ్యవహరించారు.

తిరుపతిలో వైసీపీ దుర్మార్గం

తిరుపతి: తిరుపతిలో వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విత్ డ్రా చేసుకోలేదని, 43వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాపును నేలమట్టం చేశారు. ప్రైవేటు భూమిలో అన్ని రికార్డులు ఉన్న షాపుపై దుశ్చర్యకు పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం మున్సిపల్ సిబ్బంది చేత తొలగింపజేయాలని యత్నించారు. అయితే రికార్డులు అన్ని సరిగా ఉండడంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వెనుదిరిగారు. కార్పొరేటర్‌గా  విత్ డ్రా చేసుకోనని తేల్చి చెప్పటంతో వైసీపీ నేతలు రాత్రికి రాత్రి ప్రైవేటు గుండాలతో షాపును తొలగింపజేశారు. ఈ ఘటనను మున్సిపల్ సిబ్బందిపై తోసే యత్నం చేస్తున్నారని బాధితడు వాపోయాడు.


Updated Date - 2021-02-28T15:04:17+05:30 IST