నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ABN , First Publish Date - 2021-12-20T17:30:30+05:30 IST

ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ ఎప్పుడూ ఎన్టీఆర్ ట్రస్టు ముందుంటుంది.

నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నారా భువనేశ్వరి

తిరుపతి: ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ ఎప్పుడూ ఎన్టీఆర్ ట్రస్టు ముందుంటుంది. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎలాంటి విపత్కార పరిస్థితులు ఎదురైనా మేమున్నామంటూ ఎన్టీఆర్ ట్రస్టు భరోసానిస్తుంది. ఇటీవల ఏపీలో కురిసిన కుండపోత వర్షాలకు తిరుపతి పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే. వందలాది ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో అనేకమంది బాధితులు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. అలాంటి వారికి తానున్నానంటూ ఎన్టీఆర్ ట్రస్టు అధ్యక్షురాలు నారా భువనేశ్వరి ముందుకొచ్చారు. తిరుపతి పట్టణంలో ఇప్పటికే అనేక పర్యాయాలు పర్యటించి వరదబాధితులను ఆదుకున్న భువనేశ్వరి సోమవారం కూడా మరికొంతమంది బాధితులకు సాయమందించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు సభ్యులతో కలిసి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వారికి కావాల్సిన నిత్యవసర సరుకులు, ఇతర వస్తువులను అందించనున్నారు. కొంతమంది బాధితులకు నగదు సాయం కూడా చేయనున్నారు.  

Updated Date - 2021-12-20T17:30:30+05:30 IST