తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం

ABN , First Publish Date - 2022-04-26T19:55:23+05:30 IST

తిరుపతి: రుయా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది.

తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం

తిరుపతి: రుయా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ యూనియన్ల రాక్షతత్వం కారణంగా ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని స్కూటర్‌పై తీసుకువెళ్లడం చూసినవారికి కంటతడిపెట్టించింది. ఆస్పత్రి దగ్గర ఉన్న అంబులెన్స్‌కు వారు ఎంత రేటు చెబితే అంత చెల్లించాల్సిందే. దీంతో బిడ్డ మృతదేహాన్ని తండ్రి స్కూటర్‌పై సొంతూరికి తీసుకువెళ్లాడు. రుయా ఆస్పత్రి దగ్గర ప్రభుత్వ డ్రైవర్లు, మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు ప్రైవేటు అంబులెన్స్ యాజమానులతో కుమ్మక్కయ్యారు. దీంతో ఆస్పత్రి నుంచి మృతదేహాల తరలింపు చాలా ఖరీదు వ్యవహారంగా మారింది. 


కడప జిల్లా, చిద్వేలుకు చెందిన బాలుడు అస్వస్థతతో రెండు రోజుల క్రితం రుయా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. మృత దేహాన్ని స్వగ్రామం తీసుకువెళ్లడానికి తండ్రి బయట నుంచి అంబులెన్స్ తీసుకువచ్చినా.. ఆస్పత్రి దగ్గర ఉన్న అంబులెన్స్ యూనియన్ అడ్డుకుంది. దీంతో చేసేదిలేక ఆ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని స్కూటర్‌పై తీసుకువెళ్లాడు.

Updated Date - 2022-04-26T19:55:23+05:30 IST