విషాదంలో తిరుపతి మీడియా

ABN , First Publish Date - 2020-07-13T00:14:26+05:30 IST

తిరుపతి మీడియా విషాదంలో మునిగిపోయింది. రోజు రోజుకు తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

విషాదంలో తిరుపతి మీడియా

తిరుపతి: తిరుపతి మీడియా విషాదంలో మునిగిపోయింది. రోజు రోజుకు తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనాతో వీడియో జర్నలిస్టు మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఆసుప్రతిలో చేరిన జర్నలిస్టు సాయంత్రంలోపే ప్రాణాలు విడిచాడు. వీడియో జర్నలిస్టుకు సరైన వైద్యం అందించేందుకు అన్ని మీడియా ప్రతినిధులు సాయశక్తులా కృషి చేశాయి. సరైన వైద్యం అందించాలని కలెక్టర్, ప్రజాప్రతినిధులు, స్విమ్స్ డైరెక్టర్‌కు సూచించారు. వీడియో జర్నలిస్టు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2020-07-13T00:14:26+05:30 IST