తిరునల్వేలి, నాగర్కోవిల్కు ప్రత్యేక రైళ్లు
ABN , First Publish Date - 2022-04-10T16:05:22+05:30 IST
ఈ వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశాలు ఉండటంతో ఈ నెల 17 నుంచి తిరునల్వేలి, నాగర్కోవిల్కు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. తాంబరం
చెన్నై: ఈ వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశాలు ఉండటంతో ఈ నెల 17 నుంచి తిరునల్వేలి, నాగర్కోవిల్కు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. తాంబరం రైల్వేస్టేషన్ నుంచి ఈ రైళ్లను నడుపనున్నారు. నాగర్కోవిల్కు ప్రత్యేక చార్జీలతో ఈ నెల 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10,17, 24 తేదీలలో సూపర్ఫాస్ట్ రైళ్లు తాంబరం స్టేషన్ నుంచి రాత్రి 7.30 గంటలకు బయలుదేరుతాయి. ఈ రైళ్లు నాగర్కోవిల్ నుంచి ఈ నెల 24, మే 1, 8, 15,22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీలలో సాయంత్రం 415 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజాము 4.10 గంటలకు తాంబరం చేరుకుంటాయి. ఇదే విధంగా తిరునల్వేలి నుంచి ఈ నెల 17, 24, మే 1, 8, 15,22, 29, జూన్ 5, 12, 19 26 తేదీలలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.20 గంటలకు తాంబరం చేరుకుంటాయి. ఈ రైళ్లు మళ్లీ తాంబరం నుంచి ఈ నెల 18, 25, మే 2, 16, 23, 30, జూన్ 6, 13,20, 27 తేదీలలో రాత్రి 10.20 గంటలకు బయలుదేరి మరుసటి ఉదయం 10.35కు తిరునల్వేలికి చేరుకుంటాయి.