తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2022-08-08T13:14:19+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 81,903 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.74 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 39,594 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.


Updated Date - 2022-08-08T13:14:19+05:30 IST