తిరుమల శ్రీవారి చరిత్రలోనే అత్యధిక హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2022-07-05T14:10:39+05:30 IST

తిరుమల శ్రీవారి చరిత్రలో మొదటిసారి అత్యధిక హుండీ ఆదాయం లభించింది. మొదటిసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటేసింది.

తిరుమల శ్రీవారి చరిత్రలోనే అత్యధిక హుండీ ఆదాయం

తిరుపతి : తిరుమల శ్రీవారి చరిత్రలో మొదటిసారి అత్యధిక హుండీ ఆదాయం లభించింది. మొదటిసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటేసింది. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.18 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న ఒకే భక్తుడు స్వామివారికి రూ.కోటి 64 లక్షలు సమర్పించాడు. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా ఇంతే మొత్తాన్ని అజ్ఞాత భక్తుడు సమర్పిస్తూ వస్తున్నాడు. 

Updated Date - 2022-07-05T14:10:39+05:30 IST