Tirumalaలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-06-25T13:31:02+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

Tirumalaలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala : తిరుమలలో భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 71,589 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 41,240 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.30 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెల్లడించింది. 

Updated Date - 2022-06-25T13:31:02+05:30 IST