తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2022-06-22T14:17:06+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Tirupathi : Tirumalaలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 74,906 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.07 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 


కాగా.. నేడు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సుందరేష్, మంత్రి జోగి రమేష్, గోవా మాజీ సీఎం దిగంబర కామత్, కర్ణాటక మాజీ మంత్రి రేవన్నా, బీజేపీ ఏపీ కోఇంచార్జ్ సునీల్ దీయోధర్ తదితరులు దర్శించుకున్నారు.


Updated Date - 2022-06-22T14:17:06+05:30 IST