తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 72,754 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.83 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 40,504 మంది భక్తులు దర్శించుకుని తలనీలాలు సమర్పించారు.