తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-05-26T13:00:06+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 76,148 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 39,208 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.