తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-05-24T14:18:59+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 75,324 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.03 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 35,086 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.