తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-05-19T14:29:29+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. కాగా.. బుధవారం 74,389 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 38,007 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Updated Date - 2022-05-19T14:29:29+05:30 IST