తిరుమలలో కాస్త పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-05-14T13:51:12+05:30 IST

తిరుమల: గత మూడు రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది

తిరుమలలో కాస్త పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: గత మూడు రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. కేవలం 2 వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం శ్రీవారిని 4,651 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 10 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 1889 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 


Updated Date - 2021-05-14T13:51:12+05:30 IST