ఘనంగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-13T03:17:12+05:30 IST

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పద్మావతీ పరిణయోత్సవాలు గురువారం ముగిశాయి.

ఘనంగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పద్మావతీ పరిణయోత్సవాలు గురువారం ముగిశాయి. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపానికి వేంచేశారు.ఎదుర్కోలు, పూలచెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ముగిసిన తర్వాత కొలువు జరిగింది. వేదపారాయణం తరువాత కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. హారతి అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు.టీటీడీ ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more