స్వర్ణరథంపై ఊరేగిన మలయప్పస్వామి
ABN , First Publish Date - 2022-04-16T02:06:26+05:30 IST
తిరుమల శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి
తిరుమల: తిరుమల శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై ఊరేగారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. జీయర్స్వాములు, మంత్రి వేణుగోపాలకృష్ణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రాణదానం ట్రస్టుకు రూ.30 లక్షల విరాళం
తిరుమల శ్రీవారి ప్రాణదానం ట్రస్టుకు శుక్రవారం రూ.30 లక్షలు విరాళంగా అందాయి. గుంటూరుకు చెందిన వంగా హేమలత తిరుమలలో తన కుమారుడు శ్రీకాంత్తో కలిసి విరాళం డీడీని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.