శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు టీటీడీ అనుమతి
ABN , First Publish Date - 2021-12-14T16:01:09+05:30 IST
తిరుమల శ్రీవారిని దర్శించుంకునేందుకు అమరావతి రైతులకు టీటీడీ అనుమతిని ఇచ్చింది.
అమరావతి: తిరుమల శ్రీవారిని దర్శించుంకునేందుకు అమరావతి రైతులకు టీటీడీ అనుమతిని ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని టీడీపీ తెలిపింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. నవంబర్ 1న తుళ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభమవగా... 17న తిరుపతిలో పాదయాత్ర ముగియనుంది. కోర్టు అనుమతితో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. నాలుగు జిల్లాల మీదుగా దాదాపు 5 వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రకు రైతులు ముగింపు పలుకనున్నారు.