తిరుమలలో రేపు అఖండ విష్ణుసహస్రనామ పారాయణం
ABN , First Publish Date - 2022-04-09T01:00:30+05:30 IST
తిరుమలలో శనివారం అఖండ విష్ణుసహస్రనామ పారాయణం జరగనుంది. నాదనీరాజనం వేదికపై ప్రస్తుతం జరుగుతున్న
తిరుమల: తిరుమలలో శనివారం అఖండ విష్ణుసహస్రనామ పారాయణం జరగనుంది. నాదనీరాజనం వేదికపై ప్రస్తుతం జరుగుతున్న శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం శనివారంతో ముగియనుంది. ఈ క్రమంలో అదేరోజున ఇదే వేదికపై సాయంత్రం 5.30 నుంచి ఏడు గంటల వరకు కుప్పా నరసింహం ఆధ్వర్యంలో అఖండ విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో లైవ్ ఇవ్వనున్నారు.