టీటీడీ ఉన్నతాధికారిపై రమణ దీక్షితులు విమర్శలు
ABN , First Publish Date - 2021-12-24T14:23:26+05:30 IST
టీటీడీ ఉన్నతాధికారిపై శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తిరుమల: టీటీడీ ఉన్నతాధికారిపై శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వంశపార్యపర అర్చకులను ఉన్నతాధికారి బలవంతంగా టీటీడీ ఉద్యోగులుగా మార్చారన్నారు. వంశపార్యపర అర్చక వ్యవస్థను పరిరక్షించాలన్న ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉన్నతాధికారి ఉల్లంఘించారని తెలిపారు. ఇక తరువాయి కోర్టును ఆశ్రయించడమేనా...? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసిన రమణ దీక్షితులు... దీనిపై సలహా ఇవ్వండంటూ సుబ్రహ్మణ్య స్వామిని ట్యాగ్ చేశారు.