శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్

ABN , First Publish Date - 2021-02-27T14:11:50+05:30 IST

ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్

తిరుమల: ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్ఎల్వీసీ 51 నమూన రాకెటును శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 10:24 గంటలకు పీఎస్ఎల్వీసీ 51ను నింగిలోకి ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమన్నారు. ఇస్రో ద్వారా మొదటి కమర్షియల్ ప్రయోగం కూడా ఇదే అని చెప్పారు. రాబోవు రోజుల్లో మరెన్ని రాకెట్‌లను నింగిలోకి ప్రవేశపెడుతామని శివన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-27T14:11:50+05:30 IST