తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-08-14T13:28:29+05:30 IST
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. గోగర్భం జలాశయం వరకు సర్వదర్శనం క్యూలైన్ ఉన్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతుంది. ఈనెల 20 వరకు ప్రత్యేక దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనం రద్దు చేశారు.