టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన జగన్
ABN , First Publish Date - 2021-10-12T02:59:05+05:30 IST
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఐదో రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు...
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఐదో రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు సీఎం జగన్ తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ ముద్రించిన 2022 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను జగన్ ఆవిష్కరించారు.
12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు లక్ష, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. ఇవి తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో ఇతర ప్రాంతాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంచుతారు.