శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.13కోట్లు
ABN , First Publish Date - 2020-11-28T15:33:34+05:30 IST
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల తాకిడి కొనసాగుతోంది
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల తాకిడి కొనసాగుతోంది. కోవిడ్ నేపథ్యంలో పరిమితి సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా 2కోట్ల 13లక్షలు ఆదాయం లభించింది. నిన్న శ్రీవారిని 24035 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో కోవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నారు. మాస్క్ ధరించడం..సామాజిక దూరం పాటించేలా భక్తులకు సూచిస్తున్నారు.