Tirumala: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసిన టీటీడీ

ABN , First Publish Date - 2021-09-08T13:53:08+05:30 IST

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ బుధవారం ఉదయం ప్రారంభించింది.

Tirumala: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసిన టీటీడీ

తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ బుధవారం ఉదయం ప్రారంభించింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద రోజుకి 2 వేల చొప్పున టోకెన్లను జారీ చేయనుంది. టోకెన్లను కేవలం చిత్తూరు జిల్లా వాసులకే  టీటీడీ పరిమితం చేసింది. కాగా టోకెన్ల జారీ ప్రారంభమైన వెంటనే సర్వర్లు మొరాయిండంతో 15 నిమిషాలు ఆగి తిరిగి  టోకెన్ల జారీ మొదలైంది. సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. కిలోమీటర్ మేర క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు.

Updated Date - 2021-09-08T13:53:08+05:30 IST