Tiruchendur ఆలయంలో ప్రత్యేక వసతులు

ABN , First Publish Date - 2021-10-26T13:07:05+05:30 IST

తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్నట్టు తిరుచెందూర్‌ ఆలయంలో కూడా దర్శనానికి వచ్చి వేచి వుండే భక్తులకు ప్రత్యేక సీట్ల వసతి కల్పించారు. రాజగోపురం సమీపంలోని కావేరి మండపంలో ‘భక్తులు వేచి ఉండు ప్రాంతం’ పేరిట

Tiruchendur ఆలయంలో ప్రత్యేక వసతులు

పెరంబూర్‌(Chennai): తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్నట్టు తిరుచెందూర్‌ ఆలయంలో కూడా దర్శనానికి వచ్చి వేచి వుండే భక్తులకు ప్రత్యేక సీట్ల వసతి కల్పించారు. రాజగోపురం సమీపంలోని కావేరి మండపంలో ‘భక్తులు వేచి ఉండు ప్రాంతం’ పేరిట 408 కుర్చీలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంతంలో భక్తులకు తాగునీటి వసతి, ఫ్యాన్‌ సౌకర్యం కల్పించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులను ఆలయ జాయింట్‌ కమిషనర్‌ అన్బుమణి ఆహ్వానించి, సీట్లలో కూర్చొబెట్టారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ సడలింపులతో ఆరు నెలల అనంతరం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బంగారు రథం పూజలు నిర్వహించారు.

Updated Date - 2021-10-26T13:07:05+05:30 IST