Tiruchendur ఆలయంలో ప్రత్యేక వసతులు
ABN , First Publish Date - 2021-10-26T13:07:05+05:30 IST
తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్నట్టు తిరుచెందూర్ ఆలయంలో కూడా దర్శనానికి వచ్చి వేచి వుండే భక్తులకు ప్రత్యేక సీట్ల వసతి కల్పించారు. రాజగోపురం సమీపంలోని కావేరి మండపంలో ‘భక్తులు వేచి ఉండు ప్రాంతం’ పేరిట
పెరంబూర్(Chennai): తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్నట్టు తిరుచెందూర్ ఆలయంలో కూడా దర్శనానికి వచ్చి వేచి వుండే భక్తులకు ప్రత్యేక సీట్ల వసతి కల్పించారు. రాజగోపురం సమీపంలోని కావేరి మండపంలో ‘భక్తులు వేచి ఉండు ప్రాంతం’ పేరిట 408 కుర్చీలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంతంలో భక్తులకు తాగునీటి వసతి, ఫ్యాన్ సౌకర్యం కల్పించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులను ఆలయ జాయింట్ కమిషనర్ అన్బుమణి ఆహ్వానించి, సీట్లలో కూర్చొబెట్టారు. కాగా, కరోనా లాక్డౌన్ సడలింపులతో ఆరు నెలల అనంతరం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బంగారు రథం పూజలు నిర్వహించారు.