TTD : తిరుచానూరు అమ్మవారి ఆలయ వేళల పెంపు

ABN , First Publish Date - 2021-10-17T13:31:44+05:30 IST

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని తెరిచి ఉంచే

TTD : తిరుచానూరు అమ్మవారి ఆలయ వేళల పెంపు

చిత్తూరు జిల్లా/తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. కరోనా వచ్చినప్పటి నుంచి ఉదయం 5.30 నుంచి రాత్రి 8గంటల వరకు కుదించారు. ప్రస్తుతం కొవిడ్‌ కొంతమేర తగ్గుముఖం పట్టడం, అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరగడంతో వేళలను పెంచారు. కొత్త వేళల ప్రకారం ఉదయం 4.30గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి తొమ్మిది గంటలకు జరిగే ఏకాంతసేవ తర్వాత మూసివేయమన్నారు. అమ్మవారికి జరిగే నిత్యపూజలను మాత్రం ఏకాంతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటల తర్వాతే భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-17T13:31:44+05:30 IST