కళ్ల అలసటపోతుందిలా...
ABN , First Publish Date - 2020-06-08T05:51:28+05:30 IST
ఎక్కువ సమయం ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ స్ర్కీన్ వంక చూడడం వల్ల కళ్ల మీద ఒత్తిడి ఎక్కువవుతుంది. దాంతో దురదతో పాటు కళ్లు మంటపుడతాయి. కళ్ల నుంచి నీరు కారుతుంది. అలాంటప్పుడు రోజ్వాటర్ ఉపయోగిస్తే కళ్లు తాజాగా మారతాయి...
ఎక్కువ సమయం ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ స్ర్కీన్ వంక చూడడం వల్ల కళ్ల మీద ఒత్తిడి ఎక్కువవుతుంది. దాంతో దురదతో పాటు కళ్లు మంటపుడతాయి. కళ్ల నుంచి నీరు కారుతుంది. అలాంటప్పుడు రోజ్వాటర్ ఉపయోగిస్తే కళ్లు తాజాగా మారతాయి.
- కొద్దిగా రోజ్వాటర్ను కాటన్ బాల్ మీద చల్లాలి. ఇప్పుడు కళ్లు మూసుకొని కాటన్ బాల్స్ను 15 నిమిషాల పాటు కళ్ల మీద ఉంచాలి. ఇలాచేస్తే కళ్ల అలసట మాయమవుతుంది. అంతేకాదు రోజ్ వాటర్లోని గుణాలు నొప్పిని తగ్గిస్తాయి. మెదడు కణాలను ఉత్తేజితం చేస్తాయి.
- కళ్లు ఎరుపెక్కినప్పుడు కంట్లో రెండు చుక్కల రోజ్వాటర్ వేయాలి. 20 నిమిషాల పాటు కళ్లు మూసుకొని ఉంటే కళ్ల ఎరుపు తగ్గుతుంది. అలానే కంట్లోని మలినాలు, దుమ్ముధూళిని వదిలించేందుకు కూడా రోజ్వాటర్ పనికొస్తుంది.
- కళ్ల కింద రోజ్వాటర్ రుద్దుకుంటే కళ్ల వాపు, కళ్ల కింది నల్లటి వలయాలు తగ్గిపోతాయి.
- రోజ్వాటర్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదంలో రోజ్వాటర్ను దురద, మంటపుట్టడం వంటి సమస్యలకు ఔషధంగా వాడతారు.