ఒత్తిడిని చిత్తు చేయండిలా...!

ABN , First Publish Date - 2021-04-14T18:05:41+05:30 IST

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒత్తిడి. అది ఏరకమైన ఒత్తిడినైనా మంచి ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఎదుర్కోవాలని అంటున్నారు మానసిక నిపుణులు.

ఒత్తిడిని చిత్తు చేయండిలా...!

ఆంధ్రజ్యోతి(14-04-2021)

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒత్తిడి. అది ఏరకమైన ఒత్తిడినైనా మంచి ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా  ఎదుర్కోవాలని అంటున్నారు మానసిక నిపుణులు. 


బ్లూబెర్రీస్‌లో సి- విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిని అధిగమించడానికి ఈ రెండూ ఉపయోపడతాయి. ఒత్తిడిగా అనిపించిన సమయంలో బ్లూబెర్రీస్‌ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ గ్లాసు పాలు తాగాలని అందరూ చెప్పేదే. అయితే పాలు తాగడం వల్ల   శక్తి రావడమే కాకుండా నరాల వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది. 

బ్లూ బెర్రీలలో విటమిన్‌ బి2, విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పడతాయి. ఈ రెండు విటమిన్లు రోగనిరోధక శక్తి బలోపేతం చేయడంలోనూ సహాయపడతాయి. దీని వల్ల ఒత్తిడి సందర్భాల్లో నరాలు ప్రశాంతంగా ఉండడం సాధ్యమవుతుంది. 

ఒత్తిడిని తగ్గించడంలో నారింజ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఒత్తిడిగా భావించిన సమయంలో గ్లాసు ఆరెంజ్‌ జ్యూస్‌ తాగితే రిలాక్స్‌గా అనిపిస్తుంది. 

రోజూ యోగాసనాలు వేయడం, ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి బ్రీతింగ్‌ వ్యాయామాలు కూడా ఉపకరిస్తాయి.

Updated Date - 2021-04-14T18:05:41+05:30 IST