అరికాళ్ల పగుళ్లకు చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు పాటించండి!
ABN , First Publish Date - 2022-03-03T17:26:19+05:30 IST
గట్టినేలలో చెప్పులు లేకుండా నడిచేవాళ్లకు, నీళ్లలో ఎక్కువగా ఉండే వాళ్లకు.. అరికాళ్లలో పగుళ్లు వస్తుంటాయి. సరైన ఆహారం తినకపోవడం, శుభ్రంగా
ఆంధ్రజ్యోతి(03-03-2022)
గట్టినేలలో చెప్పులు లేకుండా నడిచేవాళ్లకు, నీళ్లలో ఎక్కువగా ఉండే వాళ్లకు.. అరికాళ్లలో పగుళ్లు వస్తుంటాయి. సరైన ఆహారం తినకపోవడం, శుభ్రంగా లేకపోవడం వల్లనూ ఈ సమస్య వస్తుంది. కాలి మడిమల కింది భాగంలో ఉండి బయటికి కనిపించే ఈ పగుళ్లు చూడటానికి ఇబ్బందికరంగా కనిపిస్తాయి. వీటిని అలానే వదిలేస్తే మంటలూ పుడతాయి. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలెక్కువ. ఇలాంటి పగుళ్లకు చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి.
ఒక టబ్లో నీళ్లు పోసి అందులో నిమ్మరసం పిండాలి. రెండు కాళ్లను ఆ నీళ్లలో ఇరవై నిమిషాల పాటు ముంచి బయటికి తీయాలి. నిమ్మలో ఉండే సిట్రస్ ఆమ్లం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఇలా తరచూ చేస్తుంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది.
గోరు వెచ్చని నీటిలో కాళ్లను పెట్టడం వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.
రాత్రి నిద్రపోయే ముందు కాలి పగుళ్లకు కొబ్బరినూనె పూయాలి. పగుళ్లు ఉన్నచోట మర్దన చేయాలి.
అలొవెరా జెల్తో పాదాల పగుళ్లకు రుద్దాలి. దీనివల్ల పగుళ్లు మాయమవుతాయి.
అలాగే నువ్వుల నూనెను పగుళ్లపై రాసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.
మాగిన అరటిపండ్లను చూర్ణంగా చేసి ఆ చూర్ణాన్ని పగుళ్లకు రుద్దాలి. ఆరాక.. నిమ్మరసం కలిపిన నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.