టిప్పర్‌ బోల్తా.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-05-18T05:52:35+05:30 IST

టిప్పర్‌ బోల్తా.. ఒకరి మృతి

టిప్పర్‌ బోల్తా.. ఒకరి మృతి
రుద్రారం సమీపంలో బోల్తాపడిన టిప్పర్‌

కొడంగల్‌, మే 17: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో టిప్పర్‌ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటన మంగళవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని రుద్రారం సమీపంలో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రోడ్డుపై వెళ్తున్న ఓ టిప్పర్‌ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో టిప్పర్‌ డ్రైవర్‌ మొగులప్ప అక్కడిక్కడే మృతిచెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా, టిప్పర్‌ రుద్రారం మీదుగా తాండూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

Updated Date - 2022-05-18T05:52:35+05:30 IST