తిమ్మమ్మ మర్రిమానును సందర్శించిన సబ్‌ అడిషనల్‌ ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-17T07:02:48+05:30 IST

మండలంలోని గూటిబైలు గ్రామం లో వెలసిన తిమ్మమ్మమర్రిమానును శని వారం సబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామ్మోహన్‌ కుటుంబ సభ్యులతో కలసి సందర్శిం చారు.

తిమ్మమ్మ మర్రిమానును సందర్శించిన సబ్‌ అడిషనల్‌ ఎస్పీ

నంబులపూలకుంట,  అక్టోబరు 16: మండలంలోని గూటిబైలు గ్రామం లో వెలసిన తిమ్మమ్మమర్రిమానును శని వారం సబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామ్మోహన్‌ కుటుంబ సభ్యులతో కలసి సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆలయ పూజా రులు సబ్‌అడిషన్‌ ఎస్పీకి ఘనస్వాగతం పలికారు. ఆలయంలో తిమ్మమాంబ, బా లవీరయ్యలకు ప్రత్యేక పూజా కార్యక్ర మాల్లో వారు పాల్గొన్నారు. అనంతరం తిమ్మమ్మమర్రిమాను పరిశీలించారు. మ ర్రిమాను, తిమ్మమాంబ జీవిత చరిత్రను టూరిజం గైడు అనీల్‌, మనోహర్‌లు వారికి వివరించారు. ఆయన వెంట గాండ్లపెంట ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, జమేదార్‌ సుబ్ర మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

యోగి వేమన సమాధిని..

గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో యోగివేమన సమాధిని సెబ్‌ అడిష నల్‌ ఎస్పీ రామ్మోహన్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రజాకవి యోగి వేమన జీవిత చరిత్రపై ఆరాతీసి, ఆలయ ప్రాంగణంలో ఉన్న పద్యాలను పరిశీలించారు. ఈయన వెంట ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, పోలీసులు ఉన్నారు.

Updated Date - 2021-10-17T07:02:48+05:30 IST