సమయపాలన పాటించాలి
ABN , First Publish Date - 2021-04-13T05:11:02+05:30 IST
ఉపాధ్యాయులుసమయ పాలన పాటించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డిప్యూటి డీఈవో విజయకుమారి హెచ్చరించారు. రామయ్యవలస, మాకివలస ఎయిడెడ్ పాఠశాలలను సోమవారం సందర్శించి రికార్డులు పరిశీలించారు.
జలుమూరు, ఏప్రిల్ 12: ఉపాధ్యాయులుసమయ పాలన పాటించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డిప్యూటి డీఈవో విజయకుమారి హెచ్చరించారు. రామయ్యవలస, మాకివలస ఎయిడెడ్ పాఠశాలలను సోమవారం సందర్శించి రికార్డులు పరిశీలించారు. సైరిగాం పాఠశాల నాడు-నేడు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల రికార్డులు సరిగా నిర్వహించాలని సూచించారు. నాడు-నేడు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆమెతో పాటు ఎంఈవో బి.మాధవరావు, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.