కాంట్రాక్టు ఉద్యోగులకూ సకాలంలో జీతాలు
ABN , First Publish Date - 2020-07-14T08:01:23+05:30 IST
కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు గ్రీన్ చానల్లో పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై
- అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు గ్రీన్ చానల్లో పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్మినెం ట్ ఉద్యోగుల మాదిరిగానే వీరికీ సామాజిక, ఆరోగ్య భద్రతలపై అధ్యయనం నివేదికలు త్వరగా ఇవ్వాల ని కమిటీని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాం టి ఇబ్బందులూ రాకుండా చూడాలన్నారు. కాగా, 2017లో ఉన్న జీతాలు 2019 నాటికి 88-95 శాతం పెరిగాయని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,000 కోట్ల భారం పడుతోందని అధికారులు తెలిపారు.