విజయవాడకు కాలవ పయనం

ABN , First Publish Date - 2021-10-22T06:23:38+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 36 గం టల దీక్ష చేపట్టడంతో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు విజయవాడ బాట పట్టారు.

విజయవాడకు కాలవ పయనం
విజయవాడకు వెళ్తున్న కాలవ శ్రీనివాసులు, ఆదినారాయణ, రామ్మోహనచౌదరి తదితరులు

అనంతపురం వైద్యం, అక్టోబరు 21: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 36 గం టల దీక్ష చేపట్టడంతో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు విజయవాడ బాట పట్టారు. ఇప్పటికే ప య్యావుల కేశవ్‌, జేసీ ప్రభాకరరెడ్డి, బండారు శ్రావణితోపాటు పలువురు అక్కడకు చేరుకుని, అధినేత దీక్షకు సంఘీభా వం తెలుపుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, రామ్మోహనచౌదరి, సీనియర్‌ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు గురువా రం రాత్రి రైలుతో బయలుదేరి వెళా ్లరు. మరి కొందరు వాహనాల్లో పయనమయ్యారు.  కొన్ని చోట్ల పోలీసులు వాహనాలను అడ్డుకుని, విజయవాడ వెళ్లకుండా వెనక్కి పంపిస్తున్నారు.


Updated Date - 2021-10-22T06:23:38+05:30 IST