మా ఏకాగ్రతను చెడగొట్టి భారత్ గెలిచింది: ఆస్ట్రేలియా కెప్టెన్

ABN , First Publish Date - 2021-05-13T20:37:26+05:30 IST

తమ దృష్టిని మళ్లించి పక్కదారి పట్టించడం వల్లే టీమిండియా తమపై టెస్ట్ సిరీస్ గెలవగలిగిందని ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు

మా ఏకాగ్రతను చెడగొట్టి భారత్ గెలిచింది: ఆస్ట్రేలియా కెప్టెన్

తమ దృష్టిని మళ్లించి పక్కదారి పట్టించడం వల్లే టీమిండియా తమపై టెస్ట్ సిరీస్ గెలవగలిగిందని ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. గతేడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలిచిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా యువ ఆటగాళ్లు ఆ ఘనత సాధించారు. 


టీమిండియా ప్రతిభను తక్కువ చేసేలా ఆసీస్ కెప్టెన్ పైన్ తాజాగా మాట్లాడాడు. `టీమిండియా మమ్మల్ని పక్కదారి పట్టించింది. ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమాచారంతో ఏకాగ్రత చెడగొట్టింది. సిరీస్‌లో అలాంటి వాటికే మేం పడిపోయాం. ఆ సిరీస్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు గబ్బాకు రాలేమని టీమిండియా ఆటగాళ్లు చెప్పారు. దాంతో మేం గందరగోళంలో పడ్డాం. ఆ మ్యాచ్ జరుగుతుందో, లేదో కూడా మాకు తెలియలేదు. ఇలాంటి పక్కదారి పట్టించే పనుల్లో టీమిండియా బాగుంద`ని పైన్ అన్నాడు.  

Updated Date - 2021-05-13T20:37:26+05:30 IST