టిక్‌టాక్‌ చూడొద్దంటే భర్తనే విడిచింది!

ABN , First Publish Date - 2020-06-30T08:19:58+05:30 IST

టిక్‌టాక్‌ చూడొద్దని భర్త మందలిచాడన్న కో పంతో ఓ వివాహిత అలిగి కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిం ది. నెల్లూరు వెంగళరావునగర్‌కు చెందిన

టిక్‌టాక్‌ చూడొద్దంటే భర్తనే విడిచింది!

నెల్లూరు(క్రైం) జూన్‌ 29: టిక్‌టాక్‌ చూడొద్దని భర్త మందలిచాడన్న కోపంతో ఓ వివాహిత అలిగి కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. నెల్లూరు వెంగళరావునగర్‌కు చెందిన షేక్‌ గౌస్‌బాషా(28), కరిష్మా(25) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొంతకాలంగా కరిష్మా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు బానిసైంది. ఫోన్‌లో ఎక్కువగా టిక్‌టాక్‌ చూస్తుండడంతో తరచూ భర్త వారిస్తున్నాడు. ఈ విషయంపై దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం గౌస్‌బాషా పనికి వెళ్లిన తర్వాత కరిష్మా అలిగి ఇంటినుంచి వెళ్లిపోయింది. 

Updated Date - 2020-06-30T08:19:58+05:30 IST