తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో రాకేశ్ టికాయత్ పర్యటన

ABN , First Publish Date - 2021-02-28T22:59:12+05:30 IST

కొద్ది రోజుల క్రితం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరసన ప్రదేశానికి వెళ్లి మరీ రాకేశ్ టికాయత్‌ను కలిసి వచ్చారు. ఈ ములాఖత్‌లోనే తెలంగాణకు రావాలని, ఇక్కడి రైతులు కూడా వ్యవసాయ చట్టాల్ని

తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో రాకేశ్ టికాయత్ పర్యటన

న్యూఢిల్లీ: వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతుల్ని కూడగట్టేందుకు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రకటించింది. ఇందులో భాగంగా రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్.. ఐదు రాష్ట్రాల్లో పర్యటించి రైతుల మద్దతు కూడగట్టనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ కూడా ఉంది. అంతే కాకుండా దక్షిణ భారతదేశం నుంచి మరో రాష్ట్రమైన కర్ణాటకలో కూడా పర్యటించనున్నారు. వీటితో పాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తిరిగి సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల మద్దతును పెంచేందుకు కృషి చేయనున్నట్లు ఆదివారం బీకేయూ ఇంచార్జీ ధర్మేంద్ర మాలిక్ తెలిపారు.


కొద్ది రోజుల క్రితం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరసన ప్రదేశానికి వెళ్లి మరీ రాకేశ్ టికాయత్‌ను కలిసి వచ్చారు. ఈ ములాఖత్‌లోనే తెలంగాణకు రావాలని, ఇక్కడి రైతులు కూడా వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తున్నారని టికాయత్‌ను రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ ఆహ్వానం మేరకే కావచ్చు.. తన పర్యటనలో తెలంగాణను టికాయత్ ఎన్నకున్నారు. అంతే కాకుండా ఇక్కడ గమనించాల్సిన అంశం మరోటి ఉంది. టికాయత్ దక్షిణాది పర్యటనలో బీజేపీ ప్రభావం ఉన్న రాష్ట్రాలనే ఎన్నుకున్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో బీజేపీ చాలా బలపడింది.

Updated Date - 2021-02-28T22:59:12+05:30 IST