రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని టీడీపీ ధర్నా

ABN , First Publish Date - 2020-10-25T09:52:55+05:30 IST

రదల కారణంగా రైతులు పంటలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారికి నష్టపరిహారం ఇవ్వాలని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో..

రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని టీడీపీ ధర్నా

అవనిగడ్డ రూరల్‌, అక్టోబరు 24 : వరదల కారణంగా రైతులు పంటలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారికి నష్టపరిహారం ఇవ్వాలని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పులిగడ్డ జాతీయ రహదారిపై నాయకులు శనివారం ధర్నా చేశారు.  టీడీపీ నేతలు మాట్లాడుతూ వరద ముంపుకు గురైన పొలాల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ఉచితంగా విత్తనాలు సరఫరా చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 


గత ఏడాది, ఈ ఏడాది రెండు సార్లు వరదల కారణంగా నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం నూరుశాతం రైతులకు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం  చిట్టిబాబు, మండలి రామ్మోహనరావు, నడకుదుటి జనార్థనరావు, రావి రత్నగిరి, గాజుల మురళీకృష్ణ, అడపా శ్రీనివాసరావు, లుక్కా శ్రీనివాసరావు, బచ్చు మురళీ, దుట్టా ఠాగూర్‌, మత్తి రాంప్రసాద్‌, చందన రంగారావు, మోటుపల్లి పవన్‌, మట్టా వేణు, పుట్టి శ్రీనివాసరావు, దిడ్ల రాంబాబు, మాతంగి జనార్థన్‌, యాసం శ్రీరాములు, బచ్చు నాగేశ్వరరావు, బర్మా శ్రీను, పులిగడ్డ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-25T09:52:55+05:30 IST