టిడ్కో పీఎంఏవై లబ్ధిదారుల గగ్గోలు
ABN , First Publish Date - 2020-08-03T09:37:40+05:30 IST
ఎన్టీఆర్ గృహ సముదాయం, పీఎం ఆవాస్ యోజనలో భాగంగా గత ప్రభుత్వం నిర్మిం చిన 8912గృహాల లబ్ధిదారులు తమలో ఎవరికి ఇళ్లు దక్కాయో ..
గుడివాడ : ఎన్టీఆర్ గృహ సముదాయం, పీఎం ఆవాస్ యోజనలో భాగంగా గత ప్రభుత్వం నిర్మిం చిన 8912గృహాల లబ్ధిదారులు తమలో ఎవరికి ఇళ్లు దక్కాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది ఇప్పటికే రెండు విడతులుగా రూ.లక్ష చెల్లించారు. కొంత మంది రూ. 50వేలు, రూ.25వేలు చెల్లించారు. వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో వడపోతపోసి వారిలో 1518 మందిని అనర్హులుగా గుర్తించారు.
జాబితాలోని పేర్లలో ఎవరిని తొలగించారో మున్సిపల్ అధికారులు వెల్లడించలేదు. తొలగించిన 1518మంది స్థానంలో సెంటు స్థలం లబ్ధిదారులతో భర్తీ చేశామని కమిష నర్ సంపత్కుమార్ తెలిపారు. తొలగించిన పేర్లు ఇవ్వాలని టీడీపీ నాయకులు సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా సమాచారం ఇవ్వకపోవ డంతో అనుమానాలకు తావిస్తోంది. వలంటీర్లు ఇష్టారాజ్యంగా లబ్ధిదారులను ఎంపిక చేశారనే ఆరోపణలున్నాయి. ఎంపికైన లబ్ధిదారులు కూడా తమకు సెంటు స్థలమే కావాలని తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.