శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లు
ABN , First Publish Date - 2022-01-25T12:33:19+05:30 IST
శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లు
కర్నూలు: నేటి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఉచిత, రూ.150, రూ.300 టికెట్లను జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్లోనే శ్రీశైలం ఆలయ ఆర్జిత సేవల టికెట్లను విక్రయించనున్నారు. భక్తుల వ్యాక్సినేషన్ లేదా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.