ఆ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు

ABN , First Publish Date - 2021-03-06T22:04:42+05:30 IST

రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు దుష్ట చతుష్టయ పార్టీలు

ఆ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు

అమరావతి: రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి దుష్ట చతుష్టయ పార్టీలుగా మారాయని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డా. తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పాడి ఆవు లాంటిదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని కొన్ని పార్టీలు వట్టి పోయినవని, మరికొన్ని గొడ్డు ఆవులాంటివని ఆయన పేర్కొన్నారు. పచ్చిగడ్డి లాంటి ఓటును పాడి ఆవుకు వేసి పాలు పిండుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. బీజేపీ చేతిలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కీలుబొమ్మలుగా మారాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను దుష్ట చతుష్టయ పార్టీలుగా ఆయన అభివర్ణించారు. 


 వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే ఆయన ఆరోపించారు. ఈ దుష్ట చతుష్టయ పార్టీలకు ఓటు వేస్తే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, తదితర నిత్యావసర వస్తువులకు పెరిగిన ధరలను ప్రజలు అంగీకరించినట్లేనని ఆయన తెలిపారు. వీటికి ఓటు వేస్తే ధరలు మరింత వేగంగా పెరుగుతాయని ఆయన విమర్శించారు. ఈ పార్టీలకు ఓట్లేస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అంగీకరించినట్లేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెసో రక్షితి రక్షితః, ధర్మో రక్షిత రక్షితః అనే సామెత ప్రకారం కాంగ్రెస్‌కు ఓటెయ్యండి, కాంగ్రెస్ మిమ్ములను రక్షిస్తుందని తులసిరెడ్డి  తెలిపారు. 

Updated Date - 2021-03-06T22:04:42+05:30 IST