ఉన్నట్టుండి కదిలిన భూమి... ఏముందోనని తవ్వి చూశారు... ఒక్కసారిగా వణికిపోతూ...

ABN , First Publish Date - 2022-07-12T16:28:00+05:30 IST

అకస్మాత్తుగా భూమి కంపించడం ప్రారంభించింది.

ఉన్నట్టుండి కదిలిన భూమి... ఏముందోనని తవ్వి చూశారు... ఒక్కసారిగా వణికిపోతూ...

అకస్మాత్తుగా భూమి కంపించడం ప్రారంభించింది. దానిని గమనించినవారు అక్కడ తవ్విచూడగా 3 ఏళ్ల బాలిక బయటకు వచ్చి, హృదయాన్ని కదిలించే తన కథను చెప్పింది. బీహార్‌లోని చాప్రాలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ అమాయక బాలికను సజీవ సమాధి చేయడంపై కేసు నమోదయ్యింది. నిందితులు ఆ చిన్నారిని సజీవంగా పూడ్చిపెట్టి. అక్కడి నుంచి పరారయ్యారు. గోతిలో నుంచి బయటకు వచ్చిన ఆ చిన్నారి చెప్పిన సంగతి విన్నవారంతా నిర్ఘాంతపోయారు. 


తన తల్లి, అమ్మమ్మ తన నోటిలో మట్టి వేసి పాతిపెట్టారని ఆ చిన్నారి ఏడుస్తూ చెప్పింది. గ్రామస్థులు ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన కోప మర్హా నది ఒడ్డున ఉన్న శ్మశానవాటికలో జరిగింది. స్థానిక మహిళలు ఏదోపనిమీద అక్కడకు వచ్చారు. ఒక చోటు భూమి కంపించడం చూసి, గ్రామస్తులను పిలిచారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఆ బాలిక తన గ్రామం పేరు పోలీసులకు చెప్పలేకపోయింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారి తన తల్లిపేరు రేఖా దేవి అని, తండ్రి పేరు రాజు శర్మ అని తెలిపింది. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. 

Updated Date - 2022-07-12T16:28:00+05:30 IST