అమెరికాలో యువతుల రచ్చరచ్చ..! ఎక్స్ట్రా సాస్ కావాలంటూ..
ABN , First Publish Date - 2022-07-13T01:32:32+05:30 IST
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో రెస్టారెంట్కు వెళ్లిన ముగ్గురు యువతులు రెచ్చిపోయారు. ఎక్స్ట్రా సాస్ విషయంలో రెస్టారెంట్ సిబ్బందితో గొడవపడి విధ్వంసం సృష్టించారు.
ఎన్నారై డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో రెస్టారెంట్కు వెళ్లిన ముగ్గురు యువతులు రెచ్చిపోయారు. ఎక్స్ట్రా సాస్ విషయంలో రెస్టారెంట్ సిబ్బందితో గొడవపడి విధ్వంసం సృష్టించారు. మాన్హట్టన్ లోయర్ ఈస్ట్ సైడ్లోని బెల్ ఫ్రైస్ రెస్టారెంట్కు వెళ్లిన ముగ్గురు యువతులు.. ఫుడ్ ఆర్డర్ చేసి ఎక్స్ట్రా సాస్ కావాలని అడిగారు. అయితే దీనికి రెండు డాలర్లు ఎక్స్ ట్రా చార్జ్ అవుతుందని రెస్టారెంట్ సిబ్బంది చెప్పారు. దీంతో ఆగ్రహించిన యువతులు రెస్టారెంట్పై దాడికి దిగారు. చేతికి అందిన వస్తువులను సిబ్బందికి పైకి విసిరేశారు. కంప్యూటర్లు, క్యాష్ రిజిస్టర్తో పాటు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.
ఈ దాడిలో రెస్టారెంట్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రెస్టారెంట్కు చేరుకున్నారు. పెరల్ ఓజోరియా, చితారా ప్లాసెన్సియా, తాటియన్నా జాన్సన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ సందర్భంగా పోలీస్ అధికారిని అడ్డుకున్నందుకు ఓజోరియాపై అదనపు కేసు నమోదు చేశారు. ఆ రెస్టారెంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.