flash flood in Jammu and Kashmir: మెరుపు వరదల్లో ముగ్గురు కొట్టుకుపోయారు...
ABN , First Publish Date - 2022-08-01T14:18:10+05:30 IST
జమ్మూకశ్మీరులో గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలతో మెరుపు వరదలు వెల్లువెత్తాయి....
కథువా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో (Jammu and Kashmir)గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలతో మెరుపు వరదలు(flash flood) వెల్లువెత్తాయి. అతి భారీవర్షాల(Heavy rainfall) వల్ల పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. కథువా జిల్లాలో సంభవించిన మెరుపు వరదల వల్ల ముగ్గురు కొట్టుకుపోయారు(washed away). సల్లాన్ ప్రాంతానికి చెందిన దేవ్ రాజ్, బబ్లూ, కమల్ సింగ్ లు వరదనీటిలో కొట్టుకుపోయారని జమ్మూకశ్మీర్ అధికారులు చెప్పారు. శ్రీనగర్, బుద్గాం, గండేర్ బల్ ఉత్తర, దక్షిణ కశ్మీరు ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జమ్మూకశ్మీరులో భారతవాతావరణశాఖ (ఐఎండి) ఎల్లో అలర్ట్(yellow alert) జారీ చేసింది.
దేశంలోని పూంచ్ జిల్లా సురాన్ కోట్ తహసీల్ పరిధిలో సంభవించిన మెరుపు వరదల (flash floods in india)వల్ల పలు వాహనాలు కొట్టుకుపోయాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైనికులు సహాయ పునరావాస పనులు చేపట్టారు. కథువా జిల్లా బిల్వారా తహసీల్ లో భారీవర్షాల వల్ల ఓ ఇల్లు కూలి ఇద్దరు మరణించారు.జోజిలా పాస్ వద్ద వరదనీరు రావడంతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.