ఒకే కాన్పులో ముగ్గురు కవలలు
ABN , First Publish Date - 2021-02-27T05:57:08+05:30 IST
ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురి పిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఇందులో మగబిడ్డ, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు.
మదనపల్లె క్రైం, ఫిబ్రవరి 26:ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురి పిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఇందులో మగబిడ్డ, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. గుర్రంకొండ మండలం టి.పసలవాండ్లపల్లె పంచాయతీ తుమ్మలగొందికి చెందిన శివకుమార్ భార్య ఎం.స్వర్ణలత(25)శుక్రవారం తెల్లవారుజామున మదనపల్లె జిల్లా వైద్యశాలలో ప్రసవించారు. ముగ్గురు పిల్లకు జన్మనివ్వగా మగబిడ్డ 1,630 గ్రాములు, ఆడబిడ్డలు ఒక్కొక్కరు 1,700, 1,736 గ్రాముల బరువు ఉన్నారు. ఈక్రమంలో ఆస్పత్రి చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ మధుసూదనాచారి పిల్లలను పరీక్షించారు. బిడ్డలు బరువు తక్కువగా ఉండడంతో వార్మర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.