జమ్మూకశ్మీర్‌లో encounter..ముగ్గురు ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2022-01-07T17:53:59+05:30 IST

జమ్మూకశ్మీరులోని బుడ్గాం జిల్లా క్రాల్ పొరా చాదూరా ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ...

జమ్మూకశ్మీర్‌లో encounter..ముగ్గురు ఉగ్రవాదులు హతం

బుడ్గాం (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని బుడ్గాం జిల్లా క్రాల్ పొరా చాదూరా ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద తుపాకులు,మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన ఉగ్రవాదులను గుర్తించాల్సి ఉందని కశ్మీర్ జోన్ ఐజీ ట్వీట్ చేశారు. మరణించిన ఉగ్రవాదుల్లో శ్రీనగర్ ప్రాంతానికి చెందిన వసీంను గుర్తించామని ఐజీ చెప్పారు. మరణించిన ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారిగా భావిస్తున్నారు. మరణించిన ఉగ్రవాదుల నుంచి ఏకే 56 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నామని ఐజీ వివరించారు.  


Updated Date - 2022-01-07T17:53:59+05:30 IST