Baramullaలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్...ముగ్గురు సైనికులకు గాయాలు

ABN , First Publish Date - 2022-04-21T14:43:54+05:30 IST

కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఓ గ్రామంలో గురువారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు గాయపడ్డారు....

Baramullaలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్...ముగ్గురు సైనికులకు గాయాలు

బారాముల్లా: కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఓ గ్రామంలో గురువారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ప్రారంభ కాల్పుల్లో ముగ్గురు సైనికులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని కశ్మీర్ పోలీసు ఐజీపీ విజయ్ కుమార్ గురువారం ట్వీట్ చేశారు.బారాముల్లా జిల్లాలోని పరిస్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులతో భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.


Updated Date - 2022-04-21T14:43:54+05:30 IST