ముగ్గురు దొంగలు అరెస్టు - 4 బైకులు స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-18T04:57:45+05:30 IST

వివిధ ప్రాంతాల్లో బైకులను దొంగిలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురు దొంగలు అరెస్టు - 4 బైకులు స్వాధీనం
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు

చిట్వేలి, మే 17: వివిధ ప్రాంతాల్లో బైకులను దొంగిలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఇచ్చిన సమాచా రం వివరాల్లోకెళితే...

 అనుంపల్లె పోలీసు చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలో ముగ్గురు అనుమానితంగా పరారీ అవుతుండగా వారిని వెంబడించి అదుపులో కి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో వీరిని కె.కందులారిపల్లె, కందుల విష్ణువర్ధన్‌నాయుడు, సింగనమల వీధికి చెందిన ఆవుల విష్ణు ప్రకాష్‌, స్థానిక చర్చి వద్ద తోడేటి పెంచలయ్య అలియాస్‌ చిన్నగా గుర్తించామన్నారు.

వీరి నుంచి చిట్వేలి, కోవూరు పోలీ సు స్టేషన్లకు సంబంధించి రెండు బుల్లెట్లు, రాజంపేట పీఎ్‌సకు సంబంధించి పల్సర్‌, మన్నూరు పోలీ్‌సస్టేషన్‌కు సంబంధించిన హోండా ఆక్టివా స్వాధీనం చేసుకున్నామన్నా రు. చిట్వేలి శింగనమల వీధికి చెందిన గుత్తి రాము ఇచ్చిన ఫిర్యాదుపై ప్రత్యేక టీం ద్వారా గాలిస్తుండగా వీరిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఎస్‌ఐ అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూపోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Updated Date - 2022-05-18T04:57:45+05:30 IST