రైనా బంధువుల హత్య కేసులో ముగ్గురు దొంగల అరెస్ట్
ABN , First Publish Date - 2020-09-17T08:53:39+05:30 IST
క్రికెటర్ సురేశ్ రైనా బంధువుల్లోని ఇద్దరి హత్య కేసులో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్
చండీగఢ్: క్రికెటర్ సురేశ్ రైనా బంధువుల్లోని ఇద్దరి హత్య కేసులో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం వెల్లడించారు. గతనెల 19న అర్ధరాత్రి పఠాన్కోట్లోని రైనా బంధువు అశోక్ కుమార్ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వారి దాడిలో అశోక్ అక్కడిక్కడే మరణించగా ఆయన కుమారుడు కౌశల్ గాయాలతో ఆగస్టు 31న మృతి చెందాడు. రైనా మేనత్త ఆశారాణి ఆసుపత్రిలో ఇంకా మృత్యువుతో పోరాడుతోంది. నిందితుల్లో మరో 11 మంది పరారీలో ఉన్నట్టు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా తెలిపారు.